పేదల కంటి పాప అవుతున్న నర్సారెడ్డి భూపతిరెడ్డి *

Spread the love

పేదల కంటి పాప అవుతున్న నర్సారెడ్డి భూపతిరెడ్డి *
సాక్షిత,: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని డాక్టర్స్ కాలనీ,మగ్దూం నగర్,ఇందిరమ్మ కాలనీ లలో నిర్వహించిన కంటి పరిక్ష శిబిరంలో ఆపరేషన్లు అవసరమైన వారికి స్వంత నిధులతో ఆపరేషన్ చేయించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులూ నర్సారెడ్డి భూపతిరెడ్డి .సుమారు 25 మంది ఆపరేషన్ చేయించుకుని నేడు హాస్పిటల్ నుంచి నేరుగా నర్సారెడ్డి భూపతిరెడ్డి కార్యాలయం కు వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా వారందరూ తమ ఆశిస్సులు ఎల్లప్పుడూ భూపతి రెడ్డి వెంబడే ఉంటాయని,ఇలాంటి సేవ కార్యక్రమాలు ఇంకెన్నో నిర్వహించి,పేద ప్రజల పెన్నిధిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ,తమ తల్లి తండ్రుల ఆశయ సాధన మేరకు తన వంతు బాధ్యతగా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,ప్రజలు అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.ఆపరేషన్ చేయించుకున్న వారికి ఒక నెల రోజుల పాటు కావాల్సిన మందులతో పటు పండ్లను పంపిణి చేసారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,యువజన కాంగ్రెస్ నాయకులు మద్దికుంట నవీన్ రెడ్డి,పోషి మహేష్,అక్బర్,చెవిటి శ్రీనివాస్,గూడ ప్రవీణ్ గౌడ్,మన్నే కుమార్,మారుతి,విజయ్,బైండ్ల దయానంద్,మిద్దెల సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page