సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించగలరు: మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్

Spread the love

సాక్షిత శంకర్‌పల్లి: ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రెవిన్యూ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంటి పన్నుల విషయంలో ఎలాంటి తప్పులు ఉన్న సరిచేయుటకు గాను వారంలో ఆది, మంగళ, గురువారం రోజులలో ఉ.గం. 10:30 ని.ల నుండి మ. గం. 1:30 ని.ల వరకు పిర్యాదులు స్వీకరించబడతాయని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. కార్యక్రమంలో మునిసిపల్ మేనేజరు అంజనీ కుమార్, సీనియర్ అసిస్టెంట్ జయరాజు, వార్డ్ ఆఫీసర్లు వీరకుమార్, జనార్దన్ రెడ్డి, చంద్ర శేఖర్, మల్లేష్, చారి ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page