బీఆర్ఎస్ నాయకులను పరామర్శించి.. ధైర్యాన్నిచ్చిన ఎమ్మెల్యే..

Spread the love

MLA who gave courage after meeting BRS leaders..

బీఆర్ఎస్ నాయకులను పరామర్శించి.. ధైర్యాన్నిచ్చిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింహా రెడ్డి కి ఇటీవలే బైపాస్ సర్జరీ కావడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

అనంతరం ఇందిరమ్మ కాలనీ ఫేస్-3 కి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నీరుడి యాదగిరి ఇటీవలే బైక్ పై వెళ్తుండగా కింద పడటంతో కాలుకు గాయమైంది దీంతో ఎమ్మెల్యే ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, స్థానిక డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page