ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటా : ఎమ్మెల్యే

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ బస్తీలో మిగిలి ఉన్న సీసీ రోడ్లు, లైబ్రరీ ఏర్పాటు, హై స్కూల్ నిర్మాణంకు కృషి చేయాలని ఎమ్మెల్యే ని కోరారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తంగ లక్ష్మారెడ్డి మరియు భగత్ సింగ్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొండల శ్రీనాథ్ రావు, జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ సత్యం, కార్యవర్గ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page