నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

Spread the love

వీపన గండ్ల మండలం రంగవరం గ్రామంలో 20 లక్షల వ్యయంతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి నేడు ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా అహర్నిషలు శ్రమిస్తున్నరని, పల్లే ప్రగతి ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమని భావించి పల్లేలను అభివృద్ధి దిశగా పయాణించేలా కృషి చేస్తున్నరన్నారు.

సిఎం.కేసీఅర్ గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నారని,పల్లెల సర్వతోముఖాభివృద్దే లక్షంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

సిఎం.కేసీఅర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు,అధికారులు, బిఆర్ఎస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page