అమరవీరుల సంస్మరణ దినోత్సవం..

Spread the love

జోగులాంబ గద్వాల, దేశం కోసం ప్రాణాలర్పించి అమరులైన అమరవీరుల స్మృత్యర్థం ప్రతి సంవత్సరం జనవరి 30 న అమర వీరుల సంస్మరణ దినోత్సం సందర్బంగా 2 నిమిషాలు మౌనం పాటించిన జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్.
మంగళ వారం జిల్లా సమీకృత కార్యాలయ సమావేశం హాలు నందు జిల్లా అదికారులందరి తో కలిసి స్వాతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 30 వ తేదీన గాంధీ వర్ధంతి సందర్బంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు నిముషాలు మౌనం పాటించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ బారత స్వతంత్ర పోరాటం లో ఎందరో మహనీయులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి త్యాగం చేసి అమరులు గా నిలిచారని, వారి త్యాగాలను గుర్తిస్తూ బావి తరాలకు తెలియజేయడం మన బాద్యత అన్నారు. ఈ రోజు గాంధీ వర్దంతి సందర్బంగా అమరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు అపూర్వ్ చౌహన్, చీర్ల శ్రీనివాసులు,ఏ ఓ బద్రప్ప, కలెక్టరేట్ సిబ్బంది , జిల్లా అధికారులు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 30 At 4.04.54 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page