పేదలను అన్ని విధాల ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్…

Spread the love

KCR is the only Chief Minister who supports the poor in all ways…

పేదలను అన్ని విధాల ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్…

మన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం…

జగద్గిరిగుట్టలో 1053 మందికి పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ కు చెందిన 1053 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జగద్గిరిగుట్టలోని ఓ ఫంక్షన్ హాల్ లో ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఆసరా పింఛన్లు ఎంతో మందికి కొండంత భరోసానిస్తున్నాయని అన్నారు.

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని పేర్కొన్నారు. 57 సంవత్సరాలు నిండిన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తుందన్నారు. రాష్ట్రంలోని పేదలను అన్ని విధాల ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో డిసీ ప్రశాంతి, స్థానిక డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, మారయ్య, వేణు యాదవ్, ఇందిరా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page