రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి

Spread the love
  • మల్లేపల్లిలో ఆలయాల ప్రతిష్ట వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగలేటి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి

కూసుమంచి: మల్లేపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ సీతారామ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల వేదాశీర్వచనం పొందారు.

అనంతరం ఇదే గ్రామంలో గంగమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠ వేడుక కు హాజరై.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి..మొక్కుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, మాజీ ఎంపీపీ జూకూరీ గోపాలరావు, నాయకులు నెల్లూరి భద్రయ్య, బజ్జూరి వెంకటరెడ్డి, జొన్నలగడ్డ రవి, , రామ్మూర్తి నాయక్, హఫీజ్ ఉద్దీన్, కొప్పుల చంద్రశేఖర రావు, శ్రీనివాసరెడ్డి, తమ్మినేని నవీన్, సూర్య నారాయణ రెడ్డి, పెండ్ర అంజయ్య, సెట్ రామ్ నాయక్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page