కేసీఆర్ కప్ క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

Spread the love

KCR Cup Cricket Match was started by the municipal chair person

పెద్దపల్లి పట్టణం

కేసీఆర్ కప్ క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

కేసీఆర్ కప్ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి కేసీఆర్ కప్ క్రికెట్ మ్యాచ్ నీ ప్రారంభించారు.

పట్టణంలోని 25వ వార్డు 17వ వార్డు మధ్య మ్యాచ్ ను టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది మాదిరిగా పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు.

నియోజకవర్గంలోని అరు మండలాల్లోని గ్రామస్థాయిలో, మండల స్థాయిలో, మున్సిపాలిటీ పరిధిలో వార్డు పరిధిలో పోటీ నిర్వహించి విజేతలకు నియోజకవర్గస్థాయిలో పోటీలు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

విజేతకు 50 వేల రూపాయల నగదు బహుమతి రన్నర్ కు 25వేల రూపాయల నగదు బహుమతి అందిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు గెలుపోవటములను సమానంగా తీసుకోవాలని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page