సికింద్రాబాద్ జిల్లా ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని జూబ్లీహిల్స్ MLA

Spread the love

సికింద్రాబాద్ జిల్లా ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్ అన్నారు. సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ చేపట్టిన ఉద్యమానికి మద్దతు కోరుతూ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సమితి సభ్యులు MLA గోపినాధ్ ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు అయితే ప్రత్యేకంగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుందని, మరింత అభివృద్ధి జరిగి అనేక ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. జిల్లా ఏర్పాటు ఆవశ్యకత ను వివరిస్తూ త్వరలోనే ముఖ్యమంత్రి కి తాను లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి సాదం బాలరాజ్ యాదవ్, ఉపాధ్యక్షులు శైలేందర్, కృష్ణ ముదిరాజ్, రవీందర్ సాగర్, జగదీష్ అశోక్ తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page