గుజరాత్ మోడల్ ఫెయిల్.. తెలంగాణ మోడల్ సక్సెస్…

Spread the love

Gujarat model fail.. Telangana model success…

గుజరాత్ మోడల్ ఫెయిల్.. తెలంగాణ మోడల్ సక్సెస్…
దేశానికి సీఎం కేసీఆర్ విధానాలే ఆదర్శం…*

కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అవగాహన లేకుండా మాట్లాడుతోంది…

బండి సంజయ్ మాటల్లో నిరాశ తప్ప ఏమీలేదు…

టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియతో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

సాక్షిత : హైదరాబాద్ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి నిన్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఖండిస్తూ.. కౌంటర్ ఇచ్చారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలోని పథకాలకు అవార్డులు ఇస్తుంటే, సాధ్వి నిరంజన్ జ్యోతి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్రామీణ అభివృద్ధి, స్వచ్ఛ కార్యక్రమాల్లో తెలంగాణకు అనేక జాతీయ అవార్డులు వచ్చాయని, ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు సాధ్వి నిరంజన్ జ్యోతి ఈ విషయాలు ముందుగా తెలుసుకొని మాట్లాడాలన్నారు.

బిజెపి నేతలకు కేంద్రం నుంచి పైసా తెచ్చే సత్తా లేదని, రాష్ట్రానికి రావలసిన 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం ఇవ్వడం లేదన్నారు. బండి సంజయ్ మాటల్లో నిరాశ తప్ప ఏమీ కనబడటం లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బిజెపి పగటి కలలు కంటోందని అన్నారు. బిజెపి కేంద్రమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయాలన్నారు.

ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశ పాలన దిశగా బిజెపి కుట్రలు చేస్తోందని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. బిజెపి చేసే పనులను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. గుజరాత్ మోడల్ ఫెయిల్ అని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మోడల్ సక్సెస్ అని అన్నారు.

అందుకే బిజెపి నేతలకు భయం పట్టుకుందన్నారు. రాబోయే మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బిజెపికి గుణపాఠం చెప్పడం ఖాయం అన్నారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామ రక్ష అని, దేశానికి కూడా సీఎం కేసీఆర్ విధానాలే ఆదర్శం అని స్పష్టం అన్నారు.

Related Posts

You cannot copy content of this page