రూ.1.52 కోట్లతో ఇండోర్ షటిల్ కోర్టు పనులకు శంఖుస్థాపన…

Spread the love

Foundation stone laying for indoor shuttle court works with Rs.1.52 crores.

రూ.1.52 కోట్లతో ఇండోర్ షటిల్ కోర్టు పనులకు శంఖుస్థాపన

ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు, నాయకులు…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ నాయక్ నగర్ లో రూ.1.52 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ఇండోర్ షటిల్ కోర్టు పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, మహిళలు, నాయకులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు రెండు ఎకరాల స్థలాన్ని గుర్తించి ప్రజలకు ఉపయోగపడేలా ఇండోర్ షటిల్ కోర్టు నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు.

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. కోట్ల నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఈ పాపమ్మ, ఏఈ సురేందర్ నాయక్, మాజీ కౌన్సిలర్ రంగారావు, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, కాలనీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ శ్రీనివాస్ రావు, జనరల్ సెక్రెటరీ మహేందర్ రెడ్డి, అజయ్ కుమార్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page