అస్తమించిన టిడిపి వ్యవస్థ

Spread the love

అస్తమించిన టిడిపి వ్యవస్థను లోకేష్ కు అప్ప చెప్పడానికి, పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిస్తున్నారని, ఆఖరికి విశాఖ నగరం పై కూడా టిడిపి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు విషం కక్కుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కృష్ణాజిల్లా గుడివాడ 33 వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టిడిపి నేతలపై కొడాలి నాని ఫైర్ అయ్యారు.అమరావతిలో టిడిపి వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ మఫియా, విశాఖలో కూడా జరుగుతునట్లు ప్రచారం చేస్తున్నారని 29 గ్రామాల అమరావతి ఎక్కడ, 25 లక్షల జనాభా గల విశాఖ ఎక్కడని ఆయన ప్రశ్నించారు.విశాఖ దసపల్లా భూముల్లో టిడిపి ఆఫీసు, చంద్రబాబు అనుయాయుల కార్యాలయాలు ఉంటే విజయసాయి రెడ్డి ఎలా కబ్జా చేస్తున్నారనడం దుర్మార్గమని కొడాలి నాని ఖండించారు.ఒక అబద్ధాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలేం అమాయకులు కాదని వారు అన్ని గమనిస్తున్నారని కొడాలి నాని అన్నారు.

Related Posts

You cannot copy content of this page