ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా TRS పార్టీ ఉంటుంది

Spread the love

TRS party always stands by the activists

ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా TRS పార్టీ ఉంటుంది: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల పరిధిలోని మల్లారెడ్డిగూడెం లో ఇటీవల కాలంలో మరణించిన TRS పార్టీ కార్యకర్త P. అశోక్ కుటుంబానికి టి.ఆర్.ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా 2,00,000/- (రూపాయలు రెండు లక్షలు) విలువ గల చెక్కును వారి ఇంటికి వెళ్లి అందజేశారు.

▪️ తెరాస పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ కోసమే ఆవిర్భవించిన తెరాస పార్టీ నేడు ప్రభుత్వాన్ని నడిపుస్తున్న శుభ వేలలో ఏ ఒక్క కార్యకర్తకు, కార్యకర్త కుటుంబానికి ఆపద ఎదురవ్వకూడదనే సంకల్పంతో పార్టీ సభ్యత్వ భీమా ఏర్పాటు చేసి ఆకస్మికంగా ప్రమాదంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు సహాయం చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page