నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

Spread the love

నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని AS రాజు నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి ప్రారంభించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని AS రాజు నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది అని, హైదర్ నగర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, పనుల్లో జాప్యం లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అలాగే వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో సీసీ రోడ్డు నిర్మించాలని సంబంధిత అధికారులకు మరియు కాంట్రాక్టర్ కు సూచించారు. ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు చెప్పడం జరిగినది. అదేవిధంగా డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మీ కాలనీలో కానీ, మీ బస్తి లో కానీ ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా నన్ను కానీ, కార్పొరేటర్ కార్యాలయాన్ని కానీ సంప్రదించండి అని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్ కాలనీ వాసులు వేదమూర్తి, వెంకటేష్ యాదవ్, కృష్ణ రెడ్డి, శ్రీనివాస్, ముత్యం రెడ్డి, రాయపు రెడ్డి, ఉమాకాంత్, శివరామ కృష్ణ, వెంకటేశ్వర రెడ్డి, సుబ్రహ్మణ్యం, సుదీర్ గౌడ్, యాది రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page