6 కోట్ల 69 లక్షల 50 వేల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం

Spread the love

చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 6 కోట్ల 69 లక్షల 50 వేల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు మరియు కల్వర్ట్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్, తార నగర్,ఇందిరా నగర్, ఫ్రెండ్స్ కాలనీ,కైలాష్ నగర్,KSR ఎనక్లేవ్, డిఫెన్స్ కాలనీ,వెంకటేశ్వర నగర్,మారుతి ఎనక్లేవ్, న్యూ శంకర్ నగర్, భవాని నగర్ కాలనీలలో రూ. 06 కోట్ల 69 లక్షల 50 వేల రూపాయల అంచనావ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు,కల్వర్ట్ , స్మశాన వాటిక అభివృద్ధి నిర్మాణం పనులకు కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా చందానగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు,కల్వర్ట్ నిర్మాణం, స్మశాన వాటిక అభివృద్ధి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

*మంజూరైన అభివృధి పనుల వివరాలు….

1.తార నగర్ కాలనీ లో స్మశాన వాటిక అభివృద్ధి ,ఆధునీకరణ పనులకు రూ.150.00లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి నిర్మాణ పనులకు

2.ఇందిరా నగర్ కాలనీ లో రూ.90.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు

3.ఫ్రెండ్స్ కాలనీ, శివాజీ నగర్, కైలాశ్ నగర్,KSR ఎనక్లేవ్, డిఫెన్స్ కాలనీలలో రూ.148.00లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు

4.కైలాశ్ నగర్ కాలనీలో రూ.160.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే కల్వర్ట్ నిర్మాణము పనులకు

5.వెంకటేశ్వర నగర్,మారుతి ఎనక్లేవ్, శివాజీ నగర్ కాలనీలలో రూ.77.00లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు

6.న్యూ శంకర్ నగర్, భవాని శంకర్ నగర్ కాలనీలలో రూ.44.50లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు

పైన పేర్కొన్న సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, స్మశాన వాటిక అభివృద్ధి, కల్వర్ట్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page