జొన్నలు కొనుగోలు కేంద్రం ప్రారంభం

Spread the love

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు కి

మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ కి

రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన గద్వాల్ జిల్లా కిసాన్ అధ్యక్షుడు ఎనుముల నాగరాజు మరియు రైతులు

వడ్డేపల్లి మండలం కొంకల గ్రామం లో జొన్న పంట సమృద్ధిగా పండినది బయటి మార్కెట్లో ధర లేక ఎవరు కొనక దిక్కుతోచని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ద్వారా విన్నవించడం జరిగినది
ప్రభుత్వం కనికరించి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ క్వింటాల్ 3180 రూపాయలకు కొనుగోలు చేస్తూ వడ్డేపల్లి మండల కేంద్రంలో మరియు కొంకల గ్రామంలో రైతు వేదికల దగ్గర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో:- రైతులు జిల్లా కిసాన్ అధ్యక్షులు ఎనుముల నాగరాజు ,సత్యప్రసాద్ రెడ్డి ,యోగి రెడ్డి, బతుకన్న, మస్కే శరువన్న వేణుగోపాల్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి,గోపాల్ రెడ్డి, మస్కే కృష్ణ,సంజీవ నాయుడు,P అల్లిబాబు రాజన్న,మద్దిలేటి గ్రామ రైతులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page