14 కోట్ల రూపాయలతో గుమ్మడిదల గ్రామ సమగ్ర అభివృద్ధి

Spread the love

ఒకే రోజు 5 కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల ప్రారంభం

జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో కోటి 25 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన..

కుల సంఘాల నిర్మాణాలకు 30 లక్షల రూపాయల సొంత నిధులు అందజేత..

గుమ్మడిదల

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలో కోటి రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన బ్రాహ్మణ సంఘం, విశ్వకర్మ సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, మాల సంఘం, యాదవ సంఘం ఆత్మ గౌరవ భవనాలను ప్రారంభించి, జి.వి.ఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో ఒక కోటి 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి .

బ్రాహ్మణ సంఘానికి 25 లక్షల రూపాయలు, యాదవ సంఘం నిర్మాణానికి ఎమ్మెల్యే 5 లక్షల రూపాయల చొప్పున సొంత నిధులు అందించారు.

నూతనంగా ఏర్పడిన గుమ్మడిదల మండల కేంద్రాన్ని 14 కోట్ల రూపాయలతో ఆదర్శంగా తీర్చిదిద్దామని తెలిపారు..

హాజరైన ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి కుమార్ గౌడ్, గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page