పురుగులన్నం పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు

Spread the love

Complaint to the police that they are planting pesticides

పురుగులన్నం పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు

సారూ మా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి. ఆ పురుగులన్నం తినబుద్దైతలేదు. అయినా అదే తినాలని మా టీచర్లు చెబుతున్నారు.తినకపోతే టీసీ ఇచ్చి ఇంటికి పంపుతరట. అందుకే ఇవాళ స్కూల్​కు పోలే. వాళ్ల మీద కేసు పెట్టడానికి మీ కాడికి వచ్చిన’


ప్రశాంతిహిల్స్‌లో నివాసం ఉంటున్న శ్రీను కుమార్తె పూజిత స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది.రంగారెడ్డి జిల్లా మీర్​పేట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన సీఐ మహేందర్ రెడ్డి వెంటనే తమ సిబ్బందిని పాఠశాలకు పంపించారు.

అక్కడికి వెళ్లి పరిశీలించగా నిజంగానే కూరగాయలు బాగోలేవని, బియ్యం కూడా మట్టి పట్టి ఉన్నట్లు గుర్తించారు. ఆ చిన్నారి చూపిన ధైర్యాన్ని పోలీసులు అభినందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు చేపట్టారు…

Related Posts

You cannot copy content of this page