సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతం చేయాలి.

Spread the love

ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి .


*సాక్షిత ఆసిఫాబాద్ జిల్లా : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో త్వరలో సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలిసి జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మీ జిల్లా కేంద్రంలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఎస్పీ కార్యాలయాన్ని , సమీకృత కలెక్టర్ కార్యాలయన్ని, పరిశీలించారు.త్వరితగతన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం సీఎం కేసిఆర్ తో నిర్వహించే భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని , బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ్ రావ్ ఎస్పీ సురేశ్ కుమార్, ఎంపీపీ అరిగేలా మల్లికార్జున్ , జెడ్పీటీసీ అరిగేల నాగేశ్వర్ రావు, సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page