ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుంది..

Spread the love

*సాక్షిత : * టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా జీడిమెట్ల ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నఆర్టీసీ ఉద్యోగులు..

టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి కృతజ్ఞతతో జీడిమెట్ల ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఆర్టీసీ ఉద్యోగులచే పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరువలేనిది అని, తమ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం ఫలితంగా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విదంగా ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుంది,

టిఎస్ఆర్టిసిని కాపాడుకోవాలని ప్రజా రవాణాను విస్తృతపరిచి మరింత పటిష్టంగా చేయాలని ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ నీ విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు,ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ విజయ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ సునీత, ఆర్టీసీ ఉద్యోగులు,బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులూ,మహిళా నాయకులూ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page