నిజాంపేట్ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు రాష్ట్ర ప్రతి భవన్ సందర్శనానికై బస్సు

Spread the love

నిజాంపేట్ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు రాష్ట్ర ప్రతి భవన్ సందర్శనానికై బస్సులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉదయం బొల్లారం లోని రాష్ట్ర పతి భవన్ సందర్శనానికై బస్సులను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ప్రారంభించారు.

అలాగే విద్యార్థులకు సందర్శనానికై బసులను ఏర్పాటు చేసిన గ్యాంజస్ వ్యాలీ స్కూల్, క్యాస్టల్ టౌన్ స్కూల్, ఎస్ఆర్ డిజి స్కూల్ యజమానులకు డిప్యూటీ మేయర్ మరియు స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాద్యులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ విద్యార్థులకు స్కూల్ లో ఎటువంటి అవసరాలు వచ్చిన, ఆటంకాలు వచ్చిన తనని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రవి కిరణ్, సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, నాయకులు దశరథ్, ఉపాద్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page