జీడిమెట్ల జెడ్పి హైస్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్

Spread the love

పేద విద్యార్థులకు అండగా కూన కృష్ణ – మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆదేశాల మేరకు కేకేఎం ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా జీడిమెట్ల జెడ్పి హైస్కూల్ లో బీజేపీ నాయకుడు, ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు నర్సింహులు, శివ శరణప్ప, శివానంద్ చేతుల మీదుగా సుమారు 600 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం, గొడుగులతో కూడిన కిట్లను పంపిణీ చేసారు.

ఈ సందర్బంగా బీజేపీ నేత, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన సోదరులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , కూన జై కుమార్ గౌడ్ సహకారంతో కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగానే పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. తనకు చదువు చెప్పిన గురువుల చేతుల మీదుగా పుస్తకాల ను పంపిణీ చేయడం గర్వంగా ఉందని అన్నారు. పేద విద్యార్థులకు తాను ఎప్పుడు అండగా ఉంటానని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పంపిణీ చేస్తామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు నర్సింహులు, శివ శరణప్ప, శివానంద్, 1985-86 బ్యాచ్ పూర్వ విద్యార్థులు బాలప్ప, క్రిష్ణా రెడ్డి, వెంకటేష్, శ్రీరాములు, గోపాల్ రెడ్డి, కూన అంజి గౌడ్, మల్లేష్ గౌడ్, తాళ్ల వెంకటేష్, మహిపాల్ రెడ్డి, అంజయ్య, నాయకులు నర్సింగ రావ్, పులి సందీప్, కేకేఎం ట్రస్ట్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page