ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 3 లక్షల ఎల్ ఓ సి ని అందచేసిన భౌరంపేట్ BRS నాయకులు..

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని పోచి నవీన్ కుమార్ 2 కిడ్నీలను కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారికి కిడ్నీ ఆపరేషన్ కొరకై భౌరంపేట్ కౌన్సిలర్లు ప్రభుత్వ విప్, MLC శంభిపూర్ రాజు MLA కేపీ.వివేకానంద దృష్టికి తీసుకువెళ్ళగా వారు వెంటనే స్పందించి ఆపరేషన్ కొరకై ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 3 లక్షల ఎల్ ఓ సి ని మంజూరు చేయడం జరిగింది. ఆ చెక్కును ఈరోజు భౌరంపేట్ కౌన్సిలర్ మరియు BRS నాయకులు నవీన్ కి అందచేసారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , BRS పార్టీ నాయకులు మురళీ యాదవ్ , విష్ణువర్ధన్ రెడ్డి , 16వ వార్డ్ BRS పార్టీ కమిటీ అధ్యక్షులు మన్నె శేఖర్ , చింత వెంకట్ , గడిల బాబు , మల్లారెడ్డి , వెంకట్రామ్ రెడ్డి , సునీల్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page