విధ్యార్థుల రవాణా సౌకర్యం కొరకు ఆటో ఏర్పాటు

Spread the love

విధ్యార్థుల రవాణా సౌకర్యం కొరకు ఆటో ఏర్పాటు చేసిన BRS రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని మొల్లగూడెం గ్రామం నుండి కానుకుంట గ్రామం వరకు విధ్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతూ కాలినడకన వెల్లుచున్నారు. ఈ విషయం గురించి గ్రామస్తులు, NMR యువసేన సభ్యులు మనసున్న మారాజు, పేదల పెన్నిధి నీలం మధు ముదిరాజ్ అన్న ని రవాణా సౌకర్యం కల్పించమని కోరడం జరిగింది.

గ్రామస్తుల కోరిక మేరకు వెంటనే స్పందించి బడి పిల్లల రవాణా కొరకు మొల్లగూడెం గ్రామం నుండి కానుకుంట గ్రామం వరకు ఆటో ను గుమ్మడిదల మండల NMR యువసేన సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, NMR యువసేన నాయకులు గ్యారల మల్లేష్, ఎల్లబోయిన వెంకటేష్, జింక గోపాల్, తుజాల్ పూర్ వీరేశ్, బుద్దుల అశోక్, దేవునిచెరువు నర్సింలు, కుమ్మరి వెంకటేష్, కనకరాజు, కొరివి బిక్షపతి, సంతోష్, కుమార్, శ్రీనివాస్, ముత్యాలు, నాగేశ్, యాదగిరి, శంకర్, శేఖర్, భాస్కర్, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page