ఆసుపత్రి బిల్లుల పరిహర్థం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

Spread the love
Application to Chief Minister's Relief Fund for Hospital Bills Parihartha

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గం లో పలువురు వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహర్థం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-) ద్వారా మంజూరైన ( 9,28,000/-) తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కుల ను లబ్దిదారులకు అందచేసిన ప్రభుత్వ విప్ గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) ద్వారా 9,28,000/- తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు మంజూరి అయినవి అని, ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

CMRF- వివరాలు

ప్రియాంక , కొండాపూర్ , 22,500/-
శ్రీనివాస్ , వెంకటేశ్వర్ నగర్, 48,000/-
రాకేష్ , గంగూరు , 44,000/-
శేఖర్ , శేరిలింగంపల్లి , 60,000/-
షైక్ నసీం , విద్య నగర్, 60,000/-
కృష్ణ , ఎల్లమ్మబండ , 56,000/-


ముసలయ్య , గోపీనగర్ , శేరిలింగంపల్లి , 60,000/-
నజీమునిస్స బేగం , గోపనపల్లి , 60,000/-
పెంటయ్య , మార్తాండ నగర్ , 60,000/-
శ్రీనివాస్ , మియాపూర్ , 3,00,000/-
సైద్ సబీరా బేగం , న్యూ హాఫీజ్పేట్ , 10,500/-
పుల్లయ్య , శేరిలింగంపల్లి 49,000/-
మహేందర్ కుమార్ , హైదర్ నగర్ , 38,000/-


ఉషరాణి , శేరిలింగంపల్లి , 60,000/- మొత్తం 9,28,000/- తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు మంజూరి అయినవి అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.


అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు అబీబ్ బాయ్, కాశినాథ్ యాదవ్, తిరుపతి,రఘునాథ్, నవాజ్ ,నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page