ఎమ్మెల్యే కే పి వివేకానంద్ కి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం అందించాలి : M.P బి.బి పాటిల్….

Spread the love

ఎమ్మెల్యే కే పి వివేకానంద్ కి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం అందించాలి : M.P బి.బి పాటిల్….

ఎమ్మెల్యే అభ్యర్థి కే పి వివేకానంద్ కి మద్దతుగా కుత్బుల్లాపూర్ నియోయికవర్గం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సంఘం వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమం లో ముక్యతిదిగా పాల్గొన జహీరాబాద్ M.P బి.బి పాటిల్ మరియు మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు.

కుత్బుల్లాపూర్ నియోయికవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో బి.బి పాటిల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి చేసిన విద్యావంతుడు, కార్యశీలి, వివేకవంతుడు ఐన ఎమ్మెల్యే కే పీ వివేకానంద్ నే ముచ్చటగా మూడవసారి లక్ష మెజారిటీతో గెలిపించుకొని నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, రాష్ట్రంలోనే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో పనిచేస్తున్న ఎమ్మెల్యే కే పి వివేకానంద్ తో కలిసి నడవాలని కోరారు.

అనంతరం మరాఠా సంఘం వారు మాట్లాడుతూ నియోజవర్గంలో పరాయి రాష్ట్రము వారైనా సరే తమని హక్కున్న చేర్చుకొని ఎల్లవేళలా తమకు అందుబాటులోఉంటూ వారికీ అన్నివిధాలుగా అండదండలు అందిస్తున్న ఎమ్మెల్యే కే పి వివేకానంద్ కే తమ సంపూర్ణ మదతని తెలియజేస్తూ ఈ నెల 30 వ తేదీన జరగబోయే ఎన్నికలలో కారు గుర్తుకే ఓటువేసి ఎమ్మెల్యే వివేకానంద్ ని బారి మెజారిటీతో గెలిపించుకొని వారు చేసి అభివృద్ధి పనులలో తోడుంటామని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శంకర్ రావు అన్న దొండ్గే, ప్రకాష్ పాటిల్, సి డి చరణ్, విట్టల్ రావు, కార్పొరేటర్ కే జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్రా అశోక్, సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్, సయెద్ రషీద్, వేణు యాదవ్, ప్రకాష్ గౌడ్, ప్రవీణ్ గుప్త నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘం నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 06 At 8.45.49 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page