కొండా లక్ష్మణ్‌ బాపూజీ 10వ వర్థంతి

Spread the love

10th birth anniversary of Konda Laxman Bapuji10th

సాక్షిత : కొండా లక్ష్మణ్‌ బాపూజీ 10వ వర్థంతి సందర్భంగా 124 డివిజన్ పద్మశాలి సంఘం వారు ఏర్పాటుచేసిన నివాళి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని, ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన అన్ని పోరాటాల్లో అదే స్ఫూర్తిని కొనసాగించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ, దేశం గర్వించదగ్గ గొప్ప నేత అని, అణగారిన వర్గాల హక్కుల సాధనకు, సహకార రంగాల పటిష్టతకు తన జీవితకాలం కృషి చేశారన్నారు.

బహుజన నేతగా.. దేశవ్యాప్తంగా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్‌ బాపూజీకే దక్కిందన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, అధ్యక్షులు అనిల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, పద్మశాలి సంఘం అధ్యక్షులు ఎన్. ఆంజనేయులు, వెంకటకృష్ణ, పి.శివశంకర్, ఎస్.మోహన్, వి.విష్ణు, సి.ఎచ్. బిక్షమయ్య, బి.శంకరయ్య, ఎ. దయానంద్, ఎం.నవీన్ కుమార్, గోవర్ధన్, మణయ్య, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page