కొండాపూర్ డివిజన్ పరిధిలోని శిల్ప రామం వద్ద మంచి నీటి పైప్ లైన్ లో ఏర్పడిన లీకేజీ మరమ్మతు

Spread the love

కొండాపూర్ డివిజన్ పరిధిలోని శిల్ప రామం వద్ద మంచి నీటి పైప్ లైన్ లో ఏర్పడిన లీకేజీ మరమ్మతు మరియు పునరుద్ధరణ పనులను జలమండలి అధికారులు ,కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ట్రెడెంట్ హోటల్ , సైబర్ టవర్ జంక్షన్ నుండి శిల్ప రామం మీదుగా హైటెక్స్- నోవాటేల్ హోటల్,ఖానమేట్,ఇజ్జత్ నగర్ వరకు వెళ్లే 450 mm డయా మంచి నీటి పైప్ లైన్ లో లీకేజీ సమస్య ఏర్పడినది అని ,త్వరిత గతిన సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావలని, మంచి నీటి పైప్ లైన్ లీకేజీ పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడలని అధికారులకు ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. అదేవిధంగా పనులలో వేగం పెంచి మళ్ళీ మంచి నీటి సరఫరా కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, ప్రజలకు సకాలంలో స్వచ్చమైన తాగునీరు అందించాలని, మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు GM రాజశేఖర్ DGM నారాయణ, మేనేజర్ నివర్తి మరియు మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ , వార్డ్ సభ్యులు గుమ్మడి శ్రీనివాస్ , రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page