శంకర్‌పల్లి మునిసిపల్ కమిషనర్ ను సన్మానించిన యూత్ కాంగ్రెస్

Spread the love

శంకర్‌పల్లి మున్సిపల్ నూతన కమిషనర్ ను పురపాలక సంఘం కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొనింటి శశికాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కమిషనర్ కు ప్రెసిడెంట్ శశికాంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మునిసిపల్ పరిధిలో ఉన్న 15 వార్డులలో సమస్యలను తీర్చాలని ప్రెసిడెంట్ శశికాంత్ కమీషనర్ ను కోరారు. అందుకుగాను కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు ప్రెసిడెంట్ శశికాంత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కాశెట్టి మోహన్, ప్రశాంత్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, హుసేన్, మల్లేశం, అజాస్, శ్రీధర్, నర్సింలు, రాజు గౌడ్, శ్రీనాథ్ గౌడ్, యాదవరెడ్డి ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page