మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Spread the love

ఆదర్శ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ , ముఖ్య అతిధులుగా నిజాంపేట్ సప్తపది ఫంక్షన్ హాల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చలసాని భారతి మరియు ఆదర్శ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని భవిష్యత్తులో ఇంకా ఎన్నో రంగాల్లో విజయం సాధించాలని సూచించారు . ఈ కార్యక్రమంలో గురుడు శ్రీలత, సుజాత రెడ్డి, వాణి, రాజేశ్వరి, నాగలక్ష్మి,నళిని అడుసుమిల్లి, మాధవి, పద్మ, శిరీష, శోభ, సరళ, కుమారి,రేఖ రాజు , ఇతర ముఖ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page