మంత్రి ఎర్రబెల్లికి వేద ఆశీర్వచనాలు ఇచ్చిన వేదపండితులు

Spread the love

Vedic scholars who gave Vedic blessings to minister Errabelli

నూతన సంవత్సరం సందర్భంగా
మంత్రి ఎర్రబెల్లికి వేద ఆశీర్వచనాలు ఇచ్చిన వేదపండితులు


సాక్షిత : నూతన సంవత్సరం పురస్కరించుకుని వైష్ణవ సేవా సమితి ఆధ్వర్యంలో తిరుమల మాడభూషిణి రంగాచారి నేతృత్వంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి హైదరాబాద్, మంత్రుల నివాస ప్రాంగణంలోని ఆయన చాంబర్లో వేద పండితులు మంత్రోచ్ఛారణతో వేద ఆశీర్వచనం పలికారు.

ఈ నూతన సంవత్సరంలో మంత్రి సంకల్పించిన కార్యక్రమాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా నెరవేరాలని ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పండగలు, సంప్రదాయాలు, సంస్కృతులు విలసిల్లుతున్నాయని, వైష్ణవులు, శైవులు, బ్రాహ్మణులకు తగిన లభిస్తోందని,

వీరందరి ఆశీస్సులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసిఆర్ కి లభించి, తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. అనంతరం శ్రీ వైష్ణవ సేవా సమితి క్యాలెండర్ – 2023ను మంత్రి ఆవిష్కరించారు. మంత్రిని కలిసిన వారిలో శ్రీ వైష్ణవ సేవా సమితి అధ్యక్షులు నరహరి దేశిక చారి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణాచార్యులు, ఉపాధ్యక్షులు గోదమ్మ, ఈసి సభ్యులు శ్రీనివాసచార్యులు, రామ్మూర్తి, వెంకటరమణ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page