“దేశ రక్షణ, బావి భవిష్యత్తుకై నరేంద్ర మోడీ ని బలపరచండి”.

Spread the love

పి సుగుణాకర్ రావు, బిజెపి సీనియర్ నాయకులు.

ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ రేకుర్తిలో బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు దుర్గం మారుతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికీ బిజెపి ప్రచార కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పోల్సాని సుగుణాకర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలనుద్దేశించి వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేసిందని, మౌలిక సదుపాయాల కల్పన, పేదరిక నిర్మూలన, ఆర్థిక అభివృద్ధికై అనేక పథకాలను ప్రవేశపెట్టి దేశాన్ని ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా నిలిపిందని తెలిపారు. శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనా కవింపు చర్యలను, చొరబాట్లను సమర్థవంతంగా ఎదుర్కొని దేశ రక్షణకు తగు చర్యలు చేపట్టిందని తెలిపారు. అవినీతి అరికట్టడం, గృహ నిర్మాణం, ఉపాధి కల్పన, నైపుణ్య పెంపు, మహిళా సాధికారిత లాంటి అనేక పథకాలను చేపట్టారని అలాగే దేశానికి సుస్థిర పాలన అందించిన ఘనత నరేంద్ర మోడీ దని తెలిపారు. దేశం మరింత అభివృద్ధికై, సమాజంలో అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికై, ప్రపంచ దేశాలలో మన దేశ ప్రఖ్యాతి మరింత పెంపుదలకై 3వ సారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాడే అవసరం ఉందని అందుకే కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించాలని ఈ సందర్భంగా 19వ డివిజన్ ప్రజలను ఆయన అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు దుర్గం మారుతి , బిజెపి సీనియర్ నాయకులు తాడూరి బ్రహ్మం, బాసం కుమార్, రాచమల్ల రవీందర్ రెడ్డి,మెరుగు ఓదయ, హస్తపురం విజయ్, గోలే మల్లయ్య, జాడి కనకయ్య, గోదారి రమేష్, G. రమేష్, గొల్ల లక్ష్మణ్, గోల కమలాకర్ మరియు డివిజన్ మహిళలు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download ap

Related Posts

You cannot copy content of this page