క్రీడాకారుల్లో నైపుణ్యం పెంపొదించడానికే టోర్నమెంట్ -మంజులరెడ్డి

Spread the love

The tournament is to improve the skills of sportsmen – Manjulareddy

క్రీడాకారుల్లో నైపుణ్యం పెంపొదించడానికే టోర్నమెంట్ –మంజులరెడ్డి

కొత్తపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన మంజులరెడ్డి

హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో మంజులక్క యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ని కొబ్బరికాయ కొట్టి కొత్తపల్లి జట్ల క్రీడాకారుల పరిచయ కార్యక్రమం అనంతరం, పోటీని టాస్ వేసి టోర్నమెంట్ ప్రారంభించిన సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి, అనంతరం బ్యాట్ పట్టి అలరించారు..

మంజులరెడ్డి మాట్లాడుతూ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన క్రీడాకారులందరకి స్వాగతం తెలియచేస్తూ,గ్రామీణ స్థాయి లో క్రీడాకారులు వారి ప్రతిభ కనబర్చుకోవడానికి ఈ టోర్నమెంట్ వేదిక అని,బాగా రాణించి జిల్లా, రాష్ట్ర, స్థాయి లో ఆడాలన్నారు.

.క్రీడ పోటీల్లో గెలుపుఓటములు సహజమని, క్రీడకారులు అందరు క్రీడస్ఫూర్తిని ప్రదర్శించి,ఈ టోర్నమెంట్ ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరారు.. ఈ కార్యక్రమంలో మంజులక్క యువసేన సభ్యులు, క్రీడాకారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page