అక్కడ మోడీ, ఇక్కడ కొండా, కేంద్రంలో ఎగిరేది కాషాయపు జెండానే

Spread the love

*భాజపా పొద్దుటూర్ శక్తి కేంద్ర ఇంచార్జ్ ఏనుగుల సంజీవరెడ్డి వెల్లడి

శంకర్ పల్లి : కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, అదేవిధంగా చేవెళ్లలో గెలిచేది కొండా విశ్వేశ్వర్ రెడ్డియేనని భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం,ప్రొద్దటూర్ శక్తి కేంద్ర ఇన్చార్జ్ ఏనుగు సంజీవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో మోదీ గెలుపును, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. కేంద్రంలో మోదీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే, చేవెళ్ల పార్లమెంట్ లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి మచ్చలేని నాయకులని, ప్రజాసేవే పరమావధిగా, దృడసంకల్పంతో ఆయన ప్రజా ప్రస్థానం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో శానిటేషన్ ప్రోగ్రామ్స్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచితంగా అందిస్తున్న కుట్టు మిషన్ లు, యువతను చైతన్యం చేసేందుకు పార్లమెంటు స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ లు నిర్వహించడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటూ పార్టీ తలపెట్టిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలకు సైతం మార్గదర్శిగా నిలుస్తున్నారని అన్నారు. మేలో జరగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆయన తెలిపారు.

Related Posts

You cannot copy content of this page