సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు… నలుగురి అరెస్టు- రహస్యప్రదేశంలో విచారణ

Spread the love

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

పోలీసుల అదుపులో నలుగురు

ఈ కేసును దర్యాప్తు చేసేందుకు విజయవాడ పశ్చిమ డీసీపీ హరికృష్ణ ఆధ్వర్యంలో 20 మందితో సిట్‌ వేశారు. ఇందులో ఆరు టీంలు పని చేస్తున్నాయి. వీళ్లంతా ఆధారాల కోసం అన్వేషిస్తున్నాయి. ఎటు నుంచి దాడి జరిగింది. ఎంత దూరంలో ఉండి ఎటాక్ చేశారనే కోణంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడకు వచ్చిన జనం తీసిన వీడియోలను కూడా పరిశీస్తున్నారు. వీళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

అదుపులో ఉన్న నిందితుల్లో రౌడీషీటర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

అంత దూరం నుంచి జగన్‌కు తగిలేలా రాయి ఎలా విసిరారనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. క్యాట్‌బాల్ ఉపయోగించారా లేదా ఎయిర్‌ గన్ వాడారా అనేది పరిశీలిస్తున్నారు. అదే టైంలో ఆ ప్రాంతంలో జరిగిన ఫోన్ సంభాషణలపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు. దాడి జరిగిన ప్రాంతంలో ఇన్‌కమింగ్, ఔట్‌గౌయింగ్ కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఒకే నెంబర్ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్లినా, వచ్చినా వాటిపై ఆరా తీస్తున్నారు. ఇలా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు… అతి త్వరగా ఈ కేసు నిందితులను పట్టుకోవాలని చూస్తున్నారు.

Related Posts

You cannot copy content of this page