సూరారం కాలనీ జిల్లా పరిషత్ హైస్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల

Spread the love

సూరారం కాలనీ జిల్లా పరిషత్ హైస్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ …

విద్యార్థులు కష్టపడి చదివి..ప్రయోజకులు కావాలి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆదేశాల మేరకు కేకేఎం ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుభాష్ నగర్ డివిజన్ పరిధి సూరారం కాలనీ లోని జిల్లా పరిషత్ హైస్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో బీజేపీ నాయకుడు, ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ సుమారు 1200 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం, గొడుగులతో కూడిన కిట్లను పంపిణీ చేసారు.

ఈ సందర్బంగా బీజేపీ నేత, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, తన సోదరులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , కూన జై కుమార్ గౌడ్ సహకారంతో కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు తాము ఎల్లపుడూ అండగా ఉంటామన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోని ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కందిశ్రీరాములు, అంగడి మల్లేష్, దేవర రమేష్, పోల్కం విగ్నేష్, వెంకట రత్నం, విజేందర్ రెడ్డి, గుబ్బల లక్ష్మీనారాయణ,అనుక్, మారె గణేష్, గుబ్బల వెంకటరమణ, శ్రీనివాస్ గౌడ్, చక్రవర్తి, మహేష్ పటేల్, హరి వర్ధన్ ముదిరాజ్, విజయ్ కుమార్, కెకేఎం ట్రస్ట్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page