భూగర్భ డ్రైనేజీ పనుల పర్యవేక్షణ..!సబీహా గౌసుద్దీన్

Spread the love

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానికులు భూగర్భ డ్రైనేజీ శిథిలావస్థకు చేరి వారంలో రెండు మూడు సార్లు డ్రైనేజీ పొంగి స్థానికంగా నివసిస్తున్న ప్రజలకు ఇబ్బందికరంగా మారుతోందని స్థానికుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లడంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తక్షణమే నిధులు మంజూరు చేయడంతో పనులను ప్రారంభించుకోవడం జరిగిందని

ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ మూర్తి, మొగులయ్య, జాహేద్ షరీఫ్ బాబా, శ్రీనివాస్ యాదవ్, కొండన్న, రాము యాదవ్, కొండల్ రెడ్డి, శేఖర్, రుద్రయ్య, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, రేవతి, సన్నజాజుల లక్ష్మి, పార్వతి, పార్వతి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page