బీజేపీలోకి శ్రీనివాస్ గౌడ్.

Spread the love

డీకే అరుణతో సంప్రదింపులు పూర్తి

జితేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో.. కమలం వైపు చూస్తున్న శ్రీనివాస్ గౌడ్

రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎ స్ పార్టీ నుంచి మరో నాయకుడు కమలం గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది.ఆ నాయకుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అని ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో శ్రీని వాస్ గౌడ్ ఓడిపోయారు. అయితే ఇటీవల బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిపోయారు.దీంతో జిల్లాలో మరో బలమైన నాయకుడి కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని.. దాని కోసమే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను సంప్రదించినట్టుగా ప్రచారం జరుగుతోంది. స్వయంగా డీకే అరుణ… శ్రీనివాస్ గౌడ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు శ్రీనివాస్ గౌడ్ పై పలు కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పవర్ లో లేకపోవడం, బీఆర్ఎస్ కూడా అధికారం “ లో లేకపోవడంతో కేసులలో ఇబ్బంది అవుతుందని భావించి కమలం నేతలతో టచ్ లోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఈ కేసుల విషయంలో బీజేపీ నుంచి శ్రీనివాస్ గౌడ్ కు హామీ వచ్చిందని జిల్లాలో మాట్లాడుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారనే మాట వినిపిస్తోంది.

Related Posts

You cannot copy content of this page