సామాజిక సాధికారత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

Spread the love

సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో మద్దిల గురుమూర్తి.

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన “సామాజిక సమత సంకల్పం” కార్యక్రమంలో భాగంగా నేడు తిరుపతి ఎంపీ, సత్యవేడు నియోజకవర్గ సమన్వయ కర్త మద్దిల గురుమూర్తి ఏపీఎస్ఆర్టిసి బస్టాండ్ సర్కిల్ నందు గల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి, మానవహారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర నడిబొడ్డున ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.

అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో నేడు పరిపాలన సాగుతుందని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారి కుటుంబాలలో ఆర్థిక స్థిరత్వం, సమానత్వం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. సంక్షేమ పాలన కొనసాగాలంటే అందరూ జగన్మోహన్ రెడ్డి కి అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైనదని అందరూ కంకణ బద్దులై జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Whatsapp Image 2024 01 17 At 12.26.09 Pm
Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page