మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌ – తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష

Spread the love

సాక్షిత : తిరుపతి పట్టణంలో రంజాన్ సంబరాలు అంబరాన్నంటాయి ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించినారు. ఈ పార్థనలలో స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రంజాన్ మత సామరస్యానికి ప్రతీక అని ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే రంజాన్‌ పండుగ అన్నారు. ఆ అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికి మేయర్ డాక్టర్ శిరీష శుభాకాంక్షలు తెలియజేసారు

Related Posts

You cannot copy content of this page