వైఎస్సార్సీపీలో చేరిన పెదకూరపాడు టీడీపీ కార్యకర్తలు

Spread the love

వైఎస్సార్సీపీలో చేరిన పెదకూరపాడు టీడీపీ కార్యకర్తలు
*కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు *


సాక్షిత : పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. పెదకూరపాడు మండలం పెదకూరపాడు గ్రామానికి చెందిన టీడీపీ చెరుకూరి రాజేష్, బండారు నాగరాజు తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలని సూచించారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page