శ్రీ బి.ఏ.మ్ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

Spread the love

National Education Day is celebrated in Shri B.A.M Degree College

శ్రీ బి.ఏ.మ్ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం


రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి

షాద్నగర్ పట్టణంలోని శ్రీ బి.ఏ.మ్ డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబ్దుల్ కలం ఆజాద్ జయంతిని (జాతీయ విద్యా దినోత్సవం) జాతీయ సేవ పథకం (N.S.S) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి. వెంకటయ్య గౌడ్ మాట్లాడుతు జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీతోపాటు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎన్నో ఉద్యమాలు నిర్వహించాడాని,భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటామని విద్యార్థులకు సూచించాడు,

స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవడంలో శ్రీ బి.ఎ.మ్ డిగ్రీ కళాశాల ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుందని తెలియజేశాడు, ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నీరటి మచ్చందర్, అధ్యాపకబృందం నాగరాజు, వెంకటేశ్వర్లు, కోటిరెడ్డి, రాజు, రమేష్, విజయ్, చాందిని, మరియు విద్యార్థులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page