మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష

Spread the love

మండల కేంద్రమైన జి.కొండూరు గ్రామంలో ఉదయం జరిగిన ఎన్నికల ప్రచారంలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష పాల్గొన్నారు.

ఆమె ఇంటింటికీ తిరిగి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్ధించారు. మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారని, అలాగే పార్లమెంట్ స్థానానికి శ్రీ కేశీనేని శివనాథ్ (చిన్ని) పోటీ చేస్తున్నారని, రెండు ఓట్లను సైకిల్ గుర్తుకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page