కిడ్స్ క్లబ్ ప్లే జోన్ ను ప్రారంభించిన ఎంపీ రవిచంద్ర

Spread the love

కిడ్స్ క్లబ్ ప్లే జోన్ ను ప్రారంభించిన ఎంపీ రవిచంద్ర

ఖమ్మం బైపాస్ రోడ్డు కొత్త బస్టాండ్ వద్ద ఘనంగా ప్రారంభమైన ప్లేస్కూల్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మంలో చిన్నారులకు ఆటపాటలతో పాటు ఆహ్లాదాన్ని అందించేందుకు నెలకొల్పిన “కిడ్స్ క్లబ్ ప్లే జోన్ (ప్లే స్కూల్)”ను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం ఉదయం ప్రారంభించారు.నగరంలోని బైపాస్ రోడ్డులో కొత్త బస్టాండ్ సమీపాన నెలకొల్పిన ఈ ప్లే స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.చిన్నారులు ఆడుకోవడానికి అవసరమైన ఆట వస్తువులు,సామాగ్రి ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది.బాలబాలికలకు ఆటలతో పాటుగా ఆహ్లాదాన్ని పంచేందుకు, క్రమశిక్షణ కలిగిన భావి భారత పౌరులకు తీర్చదిద్దాలనే సదాశయంతో ఈ ప్లే జోన్ ను నెలకొల్పిన శెట్టి రంగారావును ఎంపీ రవిచంద్ర అభినందించారు.ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, మున్నూరుకాపు ప్రముఖులు పారా నాగేశ్వరరావు, ఆకుల గాంధీ,వాసుదేవుల వెంకటనర్సయ్య,పొదిల రవికుమార్,పొన్నం వెంకటేశ్వర్లు,మాడూరి పూర్ణ,ఊడిల గంగాధర్,కార్పోరేటర్ శీలంశెట్టి వీరభద్రం,మారమ్మ దేవాలయం పాలక మండలి సభ్యుడు వెంపటి ఉపేందర్, కాంగ్రెస్ నాయకులు పసుపులేటి దేవేందర్, కొత్త సీతారాములు, ప్రముఖ విద్యావేత్తలు ఆర్జేసీ కృష్ణ,కొండా శ్రీధర్ తదితరులు శెట్టి రంగారావుకు శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page