ఎంపీ నామ విస్తృత పర్యటన సత్తుపల్లి,వేంసూర్ , పెనుబల్లిలో పరామర్శలు

Spread the love

MP Nama’s extensive tour will include visits to Satthupally, Vemsur and Penuballi

ఎంపీ నామ విస్తృత పర్యటన సత్తుపల్లి,వేంసూర్ , పెనుబల్లిలో పరామర్శలు
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శనివారం వేంసూర్, సత్తుపల్లి, పెనుబల్లి, తల్లాడ తదితర మండలాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అభిమానులతో కలసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా నామ సత్తుపల్లి పట్టణంలో పలు కుటుంబాలను పరామర్శించారు.

వేల్పుల ప్రసాద్ తండ్రి ఇసాక్ ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాన్ని, దామెర రమేష్ తల్లి దామెర చంద్రావతమ్మ ఇటీవల చనిపోయారు. వారి కుటుంబాన్ని, ఫయాజ్ కుటుంబాన్ని, కౌన్సిలర్ విజయనిర్మల మామ , అమరవరపు కృష్ణారావు తండ్రి పుల్లయ్య ఇటీవల మృతి చెందారు.

వారి కుటుంబాన్ని ఎంపీ నామ పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన మహ్మద్ మిస్కేంబి కుటుంబాన్ని కూడా నామ పరామర్శించారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డాక్టర్ కూసుంపూడి నర్సింహారావు,

మున్సిపల్ ఛైర్మన్ కూసుంపూడి మహేష్ ,జెట్పీటీసీ కూసుంపూడి రామారావు, వేంసూర్ మండల రైతు బంధు అధ్యక్షులు వి. జగన్మోహన్ రావు , డీసీసీబీ డైరెక్టర్ చల్లగళ్ళ కృష్ణయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ, కౌన్సిలర్లు చాంద్ పాషా, గఫార్, కంటే అప్పారావు, షేక్ నాగులమీరా, అద్దంకి అనిల్, దేవరపల్లి ప్రవీణ్, మారుతి సూరిబాబు, గుండ్ర రఘు , పార్టీ పట్టణ యువజన విభాగం అధ్యక్షులు వల్లభనేని పవన్,మల్లూరి అంకం రాజు, నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పాపకు నామ ఆశీస్సులు

సత్తుపల్లి అంబేద్కర్ నగర్ మూడో వార్డుకు చెందిన జొన్నలగడ్డ శ్రీను ఇంటిని ఎంపీ నామ సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీను కుమారుడు శౌరీష్ అన్నప్రసన ను పురస్కరించుకుని నామ బాబును ఎత్తుకుని, ముద్దాడి, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని, బాబుకు ఆశీస్సులు అందజేశారు.

వేంసూర్ లో పరామర్శలు

ఈ సందర్భంగా కందుకూరులో గొర్ల సత్యనారాయణ రెడ్డి ( బుల్లిబాబు ) కుటుంబాన్ని నామ పరామర్శించారు.ఇటీవల సత్యనారాయణ రెడ్డి ఆనారోగ్యంతో మృతి చెందారు. అడసర్లపాడులో ఒగ్గు కరుణాకర్ రెడ్డి తండ్రి నారాయణ రెడ్డి ఇటీవల చనిపోయారు.వారి కుటుంబాన్ని , ఒకటో వార్డ్ నెంబర్ కుంచాల యాదగిరి కుటుంబాలను ఎంపీ నామ పరామర్శించారు.

ఈ కార్యక్రమాల్లో రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డాక్టర్ కూసంపూడి నర్సింహారావు, స్థానిక ప్రముఖులు గొర్ల సంజీవరెడ్డి , వి. జగన్మోహన్ రావు , కంటే వెంకటేశ్వరరావు , కూరపాటి నాని, దాసరి ప్రభాకర్ రెడ్డి ,కూరపాటి చెన్నారావు, సర్పంచ్ లు బూరుగు నాగేశ్వరరావు ,

నందిపాటి వేణుగోపాల్ రెడ్డి ,షేక్ నాగులమీరా, వెంకటేశ్వరరావు, కుక్కపల్లి సుధాకర్ తో పాటు నాయకులు జి. ప్రభాకర్ రెడ్డి , దొడ్డా వెంకట కృష్ణారెడ్డి , తుంబూరు వెంకట రెడ్డి , ఉపేందర్ రెడ్డి , గొర్ల వెంకటప్పా రెడ్డి , ఎం. సురేష్, నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్, పాల్గొనగా, అడసర్లపాడులో జరిగిన కార్యక్రమంలో జెట్పీటీసీ సురేష్ సుమలత , స్థానిక ప్రముఖులు పుచ్చకాయల లక్ష్మీ శంకర్ రెడ్డి ,కోటమర్తి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page