హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని TMR స్కూల్ & జూనియర్ కాలేజ్ బాలానగర్ బాయ్స్ -1 లో దోమల బెడద

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని TMR స్కూల్ & జూనియర్ కాలేజ్ బాలానగర్ బాయ్స్ -1 లో దోమల బెడద ఎక్కువగా ఉందని సమస్యను స్థానిక కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు దృష్టికి తీసుకొని రాగా కార్పొరేటర్ తక్షణమే స్పందించి జిహెచ్ఎంసి ఎంటమాలజి సిబ్బందితో యాంటీ లార్వా దోమల మందును పిచికారీ చేయించడం జరిగింది.*

ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ TMR స్కూల్ & జూనియర్ కాలేజ్ బాలానగర్ బాయ్స్ -1 లో దోమల బెడద ఎక్కువగా ఉందని నా దృష్టికి తీసుకొని రాగా జిహెచ్ఎంసి ఎంటమాలజి సిబ్బందితో యాంటీ లార్వా దోమల మందును పిచికారీ చేయించడం జరిగిందన్నారు. దోమల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి పిలుపునిచ్చారు. దోమ లార్వాను తోక పురుగులు అనుకోని వదిలివేయడం వల్ల దోమలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ, ఫైలేరియా పలు రకాల వ్యాధులు వస్తాయన్నారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని స్కూల్ మరియు కళాశాల యాజమాన్యానికి సూచించారు. పలు చోట్ల నిలువ ఉన్న నీటిని తొలగించారు. అదేవిధంగా అధికారులు కూడా దోమల నివారణలో సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలన్నారు. దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, ఫాగింగ్ చేయించాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు అధికారులకు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో అధికారులు ఎంటమాలజి సూపర్వైజర్ నర్సింహులు , శానిటేషన్ సూపర్వైజర్లు భరత్ రాకేష్, శ్రీకాంత్, కళాశాల ప్రిన్సిపాల్ శైలజ మరియు ఎంటమాలజి, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page