ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు…

Spread the love

MLC Shambhipur Raju participated in the unveiling of Acharya Konda Laxman Bapuji’s statue.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని లాస్ట్ బస్టాండ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర సాధనలో బాపూజీ కృషి మరువలేమన్నారు. స్థానికులు కలిసికట్టుగా ఉండి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు.

ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్, కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, తెరాస నియోజకవర్గం యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, డివిజన్ల అధ్యక్షులు రుద్ర అశోక్, విజయ్ రామ్ రెడ్డి, పుప్పాల భాస్కర్, పోలె శ్రీకాంత్, ఏర్వ శంకరయ్య, నాయకులు బేతి గోపాల్, జైహింద్, దత్తాత్రేయ, తెరాస కుటుంబ సభ్యులు, పద్మశాలి కుల బాంధవులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page