రూ.149 కోట్లతో చేపడుతున్న ఎస్.ఎన్.డి.పి పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్ష…

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.84 కోట్లతో.. జిహెచ్ఎంసి పరిధిలో రూ.95 కోట్లతో జరుగుతున్న ఎస్.ఎన్.డి.పి పనుల పురోగతిపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు, ఏజెన్సీ, కార్పొరేటర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏయే ప్రాంతాల్లో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 85% పనులు పూర్తయ్యాయని అధికారులు ఎమ్మెల్యే కి వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్ల నిధులతో చేపడుతున్న ఆయా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం లేకుండా వర్షాకాలం వరకు పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ ఆనంద్, ఈఈలు నారాయణ, కృష్ణ చైతన్య, డిఈఈలు నరేందర్, నళిని, ఏఈలు రామారావు, నాగరాజు, లక్ష్మీ నారాయణ, కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, కార్పొరేటర్లు రవికిరణ్, సురేష్ రెడ్డి, ఆగం రాజు, ఆగం పాండు ముదిరాజ్, కాసాని సుధాకర్, జ్యోతి, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, కొలన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page