6 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ (ఎల్.ఓ.సి) చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కె .పి. వివేకానంద్ ..

Spread the love

సాక్షిత :పేదల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే..*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 6 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ (ఎల్.ఓ.సి) చెక్కులను ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ తన నివాసం వద్ద కార్యాలయంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నదని అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలైన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరంలా మారిందని అన్నారు. తమ ప్రభుత్వం నిరుపేదల ఆరోగ్య భద్రతకు వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తోందన్నారు ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు..

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page